జవాన్లు అంటే మనందరికీ ఎంతో గౌరవం.ఆ గౌరవాన్ని మరింతగా పెంచుకున్నా కొందరు జవాన్లు.
వారు చేసిన పనికి అక్కడున్న వారంతా ఆనందభాష్పాలు రాల్చారు.మరి ఇంతకి వీరు చేసిన పనేంటో తెలుసుకుందామా? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్బరేలీలో డిసెంబర్ 13న ఓ పెళ్లి జరిగింది.అందులో వధువు ఎవరో కాదు.సీఆర్పీఎఫ్ అమర జవాన్ శైలేంద్ర ప్రతాప్ సింగ్ చెల్లెలు. పెళ్లి రోజున ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండగా అదే టైంలో సీఆర్పీఎఫ్ జవాన్లకు సంబంధించిన ఓ బృందం అక్కడికి వచ్చింది.వారిని చూసిన వెంటనే అక్కడున్న వారంతా కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు.
శైలేంద్ర చెల్లెలి పెళ్లి.మా చెల్లెలి పెళ్లితో సమానమంటూ పెళ్లి పనులను చకాచకా చేశారు.
పెళ్లి కూతురు జ్యోతిని వారు స్వయంగా పీఠల వద్దకు తీసుకొచ్చి అన్నయ్య చేయాల్సిన పనులన్నీ వారు చేశారు.దీంతో శైలేంద్ర కుటుంబసభ్యులే కాదు.
అక్కడికి వచ్చిన వారంతా వీరిని చూసి చాలా ఎమోషనల్ అయ్యారు.
ఈ పెళ్లికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
జవాన్లు అందరూ యూనిఫారంలలో ఉన్నారు.పెళ్లి కూతురుని మండపానికి తీసుకువస్తున్న టైంలో ఈ వీడియో తీశారు.
తన తోటి సైనికులతో శైలేంద్ర ఎప్పుడూ తన చెల్లెలి గురించి చెబుతుండే వాడు.ఆ మాటలు విన్నప్పుడల్లా ఆ జవాన్లు.
శైలేంద్ర చెల్లెలి పెళ్లికి వెళ్లాలని అనుకున్నారు.
కానీ పెళ్లి సమయంలో శైలేంద్ర అక్కడ లేకపోవడంతో ఆ లోటు జ్యోతికి తెలియనీయకుండా వారంత అక్కడికి చేరుకుని పెళ్లిని దగ్గరుండి జరిపించారు.2020వ సంవత్సరంలో పుల్వామా ఘటనలో శైలేంద్ర అమరుడైన విషయం తెలిసిందే.పెళ్లికి జవాన్లు రావడంతో శైలేంద్ర తండ్రి చాలా ఎమోషనల్ అయ్యాడు.
నా కొడుకు లేకున్నా ఈ రోజు నాకు చాలా మంది కొడుకులున్నారంటూ ఆయన కన్నీటిపర్యంతమయ్యారు.వారందరూ ఆనందంలోనూ, బాధలోనూ ఎప్పుడు మా వెంటే ఉంటారు అని చెప్పాడు.