కృష్ణపట్నం ఆనందయ్య కరోనా ఔషధం పై ఆయుష్ కమీషనర్ రాములు స్పందించారు.ఆనందయ్య మందుపై మరో ఐదు రోజుల్లో నివేదిక వస్తుందని చెప్పారు రాములు నాయక్.
ఆనందయ్య మందు గురించి సిఎం జగన్ తో కూడా చర్చించామని అన్నారు.చట్టపరంగా ఆయుర్వేద ఔషధంగా దీన్ని చెప్పలేమని అన్నారు.
క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని త్వరలోనే స్పహ్టత వస్తుందని అన్నారు.
ఆనందయ్య కరోనా ఔషుధంపై ఆయుష్ కమీషనర్ రాములు నాయక్ వివరణ ఇచ్చారు.
ఆనందయ్య మందుపై ఐదారు రోజుల్లో నిపుణుల నివేదిక వస్తుందని చెప్పారు.అది పరిశీలించాక ఆనందయ్య మందుపై కరోనా కట్టడికి ఈ మందు పనిచేస్తుందా లేదా అన్న విషయం వెల్లడవుతుందని అన్నారు.
ఆనందయ్య ఔషధంపై మూలికల గ్రంధాల్లో ఉన్నవేనని.అందులో హానికరమైన పదార్ధాలేవి లేవని చెప్పారు రాములు నాయక్.
ఈ ఔషధంతో స్వస్థత చేకూరిందని చాలామంది చెప్పారు.అయితే దీన్ని ఆయుర్వేద ఔషధంగా చెప్పలేమని అన్నారు రాములు నాయక్.క్లినికల్ ట్రయల్స్ జరిగాకే ఆయుర్వేద ఔషధంగా చెప్పగలని అన్నారు.ఆనందయ్య ఔషధాన్ని తాము తక్కువ చేసి చెప్పడం లేదని.
అలా అని కించపరచడం కూడా లేదని ఆనందయ్య ఔషధం గురిచి సీ.ఎం జగన్ తో చర్చించామని త్వరలోనే నివేదిక వస్తుందని అన్నారు రాములు నాయక్.