దేశంలో రెండు నెలలు లాక్డౌన్ను విధించడం వల్ల కలిగే ఆర్థిక నష్టంను భర్తీ చేసేందుకు, ఈ విపత్తు నుండి బయట పడేందుకు రాష్ట్రాల నుండి, సంస్థల నుండి నీతి అయోగ్ సలహాు సూచనలు కోరింది. పలు రాష్ట్రాల ప్రభుత్వాలు మరియు రాజకీయ పార్టీలు కూడా ఈ విషయమై పలు సూచనలు సలహాలు చేయడం జరిగింది.
తెలుగు దేశం పార్టీ తరపున చంద్రబాబు నాయుడు టీం కూడా నీతి ఆయోగ్కు కొన్ని సలహాలు సూచనలు చేయడం జరిగిందట.తాజాగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ వాటిపై స్పందించారు.
చంద్రబాబుకు రాజీవ్ కుమార్ ఒక లేఖ రాశారు. అందులో మీరు కోవిడ్ 19 పై పోరాటం విషయంలో ఇచ్చిన సలహాలు సూచనలు బాగున్నాయి.ఈ సమయంలో మీరు అందించిన సలహాలు చాలా ఉపయోగదాయకంగా ఉన్నాయి. మా విజ్ఞప్తి మేరకు మీ టీం సలహాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు అన్నారు.
మీరు చాలా విశ్లేషణాత్మకంగా మాకు సమాచారంను అందించారు.భవిష్యత్తులో మీ సూచనలు తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామంటూ పేర్కొన్నారు.