మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి మెగాస్టార్ తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.అయితే ఈ సినిమాలో హీరోయిన్గా తొలుత అందాల భామ త్రిషను అనుకున్న సంగతి తెలిసిందే.
ఆమె ఈ సినిమాలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ కూడా అనౌన్స్ చేసింది.కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుండి వాకౌట్ చేసింది.కాగా త్రిష ఎందుకు వెళ్లిపోయిందనే విషయం ఇండస్ట్రీలో చాలా చర్చనీయాంశంగా మారింది.అయితే ఆమెకు చిత్ర యూనిట్తో మనస్పర్థలు రావడంతో ఈ సినిమా నుండి వాకౌట్ చేసిందని త్రిష స్వయంగా తెలిపింది.
దీంతో వెంటనే మరో హీరోయిన్ కాజల్ అగర్వాల్ను చిత్ర యూనిట్ ఈ సినిమాలో ఫైనల్ చేశారు.
అయితే తెలుగులో ఆచార్య సినిమాలో త్రిష చేసిన ఘనకార్యమే తమిళంలో కాజల్ చేసిందట.
తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ సరసన ఓ సినిమా చేసేందుకు అడ్వాన్స్ కూడా తీసుకుందట.కానీ మెగాస్టార్ సినిమా కోసం ఆ సినిమాను వదిలేసి వచ్చిందట.కాగా తమ అడ్వాన్స్ను వెనక్కి ఇచ్చేయాలంటూ సదరు చిత్ర యూనిట్ కోరిందట.మొత్తానికి ఆచార్య చిత్రానికి హీరోయిన్ ఎఫెక్ట్ గట్టిగానే ఉందని తెలుస్తోంది.