ఇతర డైరెక్టర్లతో, హీరోలతో సరదాగా ఉండే హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరనే సంగతి తెలిసిందే.తారక్ ఇండస్ట్రీలోని అందరు హీరోలతో స్నేహపూర్వకంగా మెలగడంతో పాటు చాలామంది డైరెక్టర్ల నుంచి ప్రశంసలు అందుకున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలోని సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు.ఎన్టీఆర్ తర్వాత సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు.
చాలా కాలం క్రితమే ఈ సినిమా షూటింగ్ మొదలుకావాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది.కొరటాల శివ ఆచార్య ప్రమోషన్లలో భాగంగా ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి ఆసక్తికర అప్ డేట్స్ ఇచ్చారు.
ఎన్టీఆర్ తో హై వోల్టేజ్ సినిమాను తెరకెక్కిస్తానని కొరటాల శివ కామెంట్లు చేశారు.గత సినిమాల బ్యాగేజీలు తనకు వద్దని తారక్ కొరకు మంచి కథను సిద్ధం చేశానని కొరటాల శివ వెల్లడించారు.
తాను ఏ కథను రాసుకున్నానో ఆ కథను ఎక్కువమందికి రీచ్ అయ్యే విధంగా ప్రయత్నిస్తున్నానని కొరటాల శివ చెప్పుకొచ్చారు.తన సినిమాకు సంబంధించి తారక్ తనను డిస్టర్బ్ చేయలేదని కొరటాల శివ కామెంట్లు చేశారు.
ఆచార్య సినిమా పూర్తైతే తనను కిడ్నాప్ చేసుకొని వెళతానని తారక్ అన్నారని కొరటాల శివ వెల్లడించారు.మే 20వ తేదీన తారక్ పుట్టినరోజు సందర్భంగా అప్ డేట్స్ ఇస్తానని కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు.
ఆ సమయంలోనే అధికారికంగా అన్ని విషయాలు వెల్లడవుతాయని కొరటాల శివ పేర్కొన్నారు.మే 20వ తేదీన ఎన్టీఆర్ బుచ్చిబాబు కాంబో సినిమాకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది.కొరటాల శివ తొలి పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారని తెలుస్తోంది.