హైద్రాబాద్ సిటీలో మరో మల్టీప్లెక్స్ రానుంది.అమీర్ పేట్లో AAA మల్టీప్లెక్స్ రానుంది.
సిటీకి లాండ్ మార్క్లా ఈ మల్టీప్లెక్స్ ఉండబోతోంది.నారాయణ్ దాస్ నారంగ్, అల్లు అరవింద్, మురళీ మోహన్, ఎన్ సదానంద్ గౌడ్ల భాగస్వామ్యంలో ఈ మల్టీప్లెక్స్ నిర్మితమవుతోంది.
సత్యం థియేటర్కు ఉన్న విశిష్టత అందరికీ తెలిసిందే.ప్రస్తుతం అక్కడే ఇప్పుడు ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది.మాల్కు సంబంధించిన నిర్మాణం పూర్తయింది.నేడు మల్టీప్లెక్స్ నిర్మాణం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ పూజా కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్ తదితరులు పాల్గొన్నారు.వరల్డ్ క్లాస్ విజువల్స్, ఆడియో ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు రాబోతోన్న ఈ మల్టీప్లెక్స్ను AAA గా పిలవబోతోన్నారు.
హైద్రాబాద్ ప్రజలను ఆకట్టుకునేలా, అలరించేలా ఈ మల్టీ ప్లెక్స్ తయారవుతోంది.