ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది.151 పరుగుల తేడాతో మ్యాచ్ ను గెలిచింది.ఇకపోతే ఈ మ్యాచ్ లో హైలెట్ గా ఇద్దరు బౌలర్లు నిలిచారు.పరుగులతో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టారు.టీమిండియా బౌలర్లు అయిన మహహ్మద్ షమీ, బుమ్రాలు వికెట్లు పడగొడతారనేది అందరికీ తెలిసిందే.అయితే వీళ్లు రెండో టెస్టు మ్యాచ్ లో పరుగుల వర్షం కురిపించారు.
ఇద్దరూ మంచి భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియా విజయానికి కారకులయ్యారు.మహమ్మద్ షమీ 70 బంతుల్లో 56 పరుగులు చేసి నాటౌట్ నిలిచాడు.
అలాటే జస్ప్రీత్ బుమ్రా 64 బాల్స్ కు 34 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.ఇద్దరూ కూడా మంచి ఆటతీరును కనబరిచి ఇంగ్లండ్ జట్టు సభ్యుల చేత ఔరా అని అనిపించారు.
ఇంగ్లండ్ తో రెండు టెస్టు మ్యాచ్ జరుగుతుండగా భారత్ 209 రన్స్ కే 8 వికెట్లను కోల్పోయింది.భారత్ కు ఓటమి ఎదురవుతుందనే విషయం అందరికీ స్పష్టంగా అనిపించింది.
కష్టాల్లో ఉన్న భారత్ను షమీ, బుమ్రాలు ఆదుకున్నారనే చెప్పాలి.9వ వికెట్ కు ఈ ఇద్దరు కూడా మంచి ఆటతీరును కనబరిచి 89 రన్స్ తో భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.షమీ ఇంగ్లండ్ బౌలర్లకు కాస్త చెమటలు పట్టించాడనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.
ఇకపోతే షమీ తన కెరీర్ లో రెండో అర్థ శతకాన్ని ఈ టెస్ట్ మ్యాచ్ లో నమోదు చేయడం విశేషం.మ్యాచ్ మధ్య లంచ్ బ్రేక్ టైంలో షమీ, బుమ్రాలు డ్రెసింగ్ రూమ్ వస్తుండగా వారికి టీమిండియా క్రికెటర్లు ఉత్సాహకర రీతిలో స్వాగతం పలికారు.చప్పట్లతో విజిల్స్ వేస్తూ వారిని ప్రశంసించారు.
క్రికెటర్లంతా లేచి నిలబడి షమీ, బుమ్రాను సాదరంగా ఘన స్వాగతం పలికినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ వీడియోను చూసి నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.