ఈ మధ్య కాలంలో టాలీవుడ్ నిర్మాతలు హీరోల మార్కెట్, గత సినిమాల కలెక్షన్లను బట్టి సినిమాలపై భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు.ఇలా చేయడం వల్ల సినిమా హిట్టైతే భారీ మొత్తంలో లాభాలు వస్తుండగా సినిమా ఫ్లాపైతే మాత్రం నిర్మాతల అంచనాలను మించి నష్టాలు వస్తున్నాయి.
అయితే కొరటాల తారక్ కాంబో మూవీ ఏకంగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది.
ఇంటెన్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా ఎంపిక కాగా ఈ సినిమాకు అలియా రెమ్యునరేషన్ 20 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండనుంది.
ఎన్టీఆర్, కొరటాల శివ రెమ్యునరేషన్లకు 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఖర్చయ్యే అవకాశాలు ఉన్నాయి.అయితే 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమా నిర్మించడం అంటే ఒక విధంగా రిస్క్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కేవలం 70 రోజుల కాల్షీట్లను మాత్రమే కేటాయించనున్నారని సమాచారం.ఈ 70 రోజుల్లోనే తనకు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేయాలని తారక్ షరతు విధించారని బోగట్టా.
కొరటాల శివ సైతం ఆ షరతుకు అంగీకరించారని తెలుస్తోంది.నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
కళ్యాణ్ రామ్ తారక్ కు సోదరుడు కాగా సుధాకర్ కొరటాల శివ స్నేహితుడు కావడం గమనార్హం.
ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనుంది.కొరటాల శివ ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ఎక్కువ సమయం కేటాయించడంతో పాటు స్క్రిప్ట్ పర్ఫెక్ట్ గా వచ్చే వరకు రాజీ పడలేదని తెలుస్తోంది.జూన్ నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.