వైఎస్ వివేకా హత్య కేసుపై రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు..!!

తెలుగు రాష్ట్రాలలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే.సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు జరిగిన ఈ హత్య ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.

 Raghurama Krishnam Raju Sensatational Comments On Ys Vivekananda Reddy Case , Cb-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ చేతిలో ఉన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఈ హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది.

భూవివాదం వల్లే వైఎస్ వివేక హత్య చేయబడినట్లు.40 కోట్ల సుపారీ తీసుకున్నట్లు ఇటీవల దస్తగిరి సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు.ఈ క్రమంలో ఎనిమిది కోట్ల భూమి వివాదానికి.40 కోట్ల సుపారీ తీసుకోవటం చాలా వింతగా ఉందని ఈ హత్య కేసుపై తాజాగా వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కామెంట్ చేశారు.దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం పూర్తిగా.కేసును తప్పుదోవ పట్టించే విధంగా ఉందని పేర్కొన్నారు.ఈ కేసులో అసలు నిందితులను బయటపెట్టాలని రఘురామ కృష్ణంరాజు సిబిఐ అధికారులను కోరుతూ మరింత లోతుగా దర్యాప్తు చేయాలని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube