దక్షిణాఫ్రికాలోని (South Africa)ఫ్రీ స్టేట్ ప్రావిన్స్లోని ఆంగ్లో బోయర్ వార్ మ్యూజియంలో భారత జాతిపిత మహాత్మాగాంధీ (Mahatma Gandhi, the Father of the Nation of India)భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఇక్కడి వర్ణ వివక్ష చట్టం ఒక శతాబ్ధానికి పైగా భారతీయులను నిషేధించింది.
పద్మభూషణ్ అవార్డు గ్రహీత రామ్ వంగి సుతార్ ఈ కాంస్య విగ్రహాన్ని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్.ఈ మ్యూజియంకు విరాళంగా ఇచ్చింది.
దీనిని ఏప్రిల్ 11న భారత హైకమీషనర్ ప్రభాత్ కుమార్ (Indian High Commissioner Prabhat Kumar)ఆవిష్కరించారు.అలాగే 1899 – 1902 నాటి ఆంగ్లో – బోయర్ యుద్ధంలో భారతీయుల పాత్రపై ఇప్పటి వరకు ఎవరూ చెప్పని కథపై ఒక డాక్యుమెంటరీ, పుస్తకం కూడా ఆయన ఆవిష్కరించారు.
1994లో దక్షిణాఫ్రికా తొలి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి అధ్యక్షుడిగా నెల్సన్ మండేలా ఎన్నికయ్యే వరకు .గతంలో ఆరెంజ్ ఫ్రీ స్టేట్గా (Orange as a Free State_పిలవబడే ఈ ప్రావిన్స్ భారతీయులను నిషేధించింది.తమ పూర్వీకులు తొలుత చెరకు తోటలో ఒప్పంద కార్మికులుగా దిగిన తీరప్రాంత నగరమైన డర్బన్కు భారతీయులు చేరుకోవడానికి ఈ ప్రావిన్స్ గుండా ప్రయాణించేవారు.ఇందుకోసం వారు ముందస్తు అనుమతులు పొందాల్సి వచ్చింది.

బ్లోమ్ఫోంటెయిన్లోని వార్ మ్యూజియంలో ఆంగ్లో – బోయర్ వార్(Anglo-Boer War) గురించిన వివరాలు పొందుపరిచారు.ఈ యుద్ధంలో శ్వేతజాతి ఆఫ్రికన్, నల్లజాతి, భారతీయులు సహా అన్ని జాతుల దక్షిణాఫ్రికా ప్రజలు పాల్గొన్నారని వార్ మ్యూజియం డైరెక్టర్ టోకీ ప్రిటోరియస్ అన్నారు.తాజా ప్రచురణ ద్వారా దక్షిణాఫ్రికాలోని భారతీయులు, భారత్ నుంచి వచ్చిన వారికి గుర్తింపు దక్కుతుందని టోకీ అభిప్రాయపడ్డారు.యుద్ధంలో పాల్గొన్న ఇతర జాతీయుల ఉమ్మడి బాధ ఇప్పుడు గుర్తింపుకు నోచుకుందని పేర్కొన్నారు.
ప్రపంచంలో ఎక్కడా చెప్పని కథను ఈ జర్నల్ చెబుతుందని టోకీ తెలిపారు.యుద్ధ సమయంలో భారతీయులు పక్షపాతం, వివక్షను ఎదుర్కొన్నారు.
ఇప్పుడు ఈ పరిస్ధితులు మారాయని.చివరికి భారతీయుల సహకారానికి గుర్తింపు లభించిందని ప్రిటోరియస్ తెలిపారు.

‘ క్యాట్ ఇన్ ది క్రాస్ ఫైర్ – ఇండియన్ ఇన్వాల్వేషన్ ఇన్ ది సౌత్ ఆఫ్రికా వార్’ అనే పుస్తకంలో యుద్ధ సమయంలో దక్షిణాఫ్రికాలో సేవలందించిన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ గురించి ఒక అధ్యాయం ఉంది.దీనిని తొలుత దివంగత డాక్టర్ టీజీ రామమూర్తి రాసిన మోనోగ్రాఫ్ తాలుకా పునర్ముద్రణ.తొలుత దీనిని భారతదేశంలో ప్రచురించగా.డర్బన్లోని భారత కాన్సులేట్ అనుమతితో పునర్ముద్రించారు.