రాజ్ తరుణ్, లావణ్య (raj Tarun ,lavanya) ల పేర్లు మొదటి వరకు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో మారుమోగిన విషయం తెలిసిందే.నాలుగు గోడల మధ్య జరగాల్సిన విషయం కాస్త మీడియా పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళింది.
ఇదే విషయం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.కొద్దిరోజుల పాటు ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు.
అయితే రాజ్ తరుణ్ కు సారీ చెప్పి లావణ్య సైలెంట్ గా ఉంటున్న సమయంలో మరోసారి రాజ్ తరుణ్-లావణ్య ల మధ్యన రచ్చ మొదలయ్యింది.
రాజ్ తరుణ్ పేరెంట్స్ కోకాపేటలోని రాజా తరుణ్ లావణ్య (raj Tarun ,lavanya)విల్లా దగ్గరకు రావడం, అక్కడ వాళ్ళను లావణ్య బయటికి పంపించడమే కాదు రాజ్ పేరెంట్స్ తనని కొట్టారంటూ మీడియా కెక్కడం అన్ని మళ్లీ స్టార్ట్ అయ్యింది.
తనని శేఖర్ బాషా (Shekhar Basha)ఆడదాని వేషంలో వచ్చి కొట్టాడని, అతనికి ఫ్యామిలీ ఉంది, సర్వనాశనం అవుతాడు, తనకి ఒక కూతురు ఉంది ఆమెకి ఇలానే అయితే ఏం చేస్తాడు అంటూ శేఖర్ బాషా పై లావణ్య ఫైర్ అయ్యింది.రాజ్ తరుణ్ ని వదిలెయ్యమని అరియనా తనకి 50 లక్షలు ఆఫర్ చేసింది అంటూ లావణ్య సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

రాజ్ తరుణ్ తన ఇంట్లోకి కుక్క పిల్లలను తెచ్చుకున్నట్టే అరియానా(ariyana) ను తెచ్చుకుంటాను అన్నాడు.అరియానా కూడా నాకు చెప్పింది.రాజ్ తో అరియానకు( raj Tarun and Ariyana) ఎఫ్ఫైర్ ఉంది నాకు తెలుసు.అరియనా నాతో స్వయంగా మాట్లాడింది.ఆ విషయం రాజ్ తరుణ్ ముందే తేల్చుకుందాం అంటూ రాజ్ తరుణ్ పై లావణ్య ఫైర్ అయ్యింది.ఇక రాజ్ తరుణ్ పేరెంట్స్ కళ్ళ నీళ్లు పెట్టుకోవడంతో వాళ్ళను ఇంట్లోకి రానిచ్చాను.
రాజ్ తరుణ్ ని మాత్రం వదలను, అతనికి శిక్ష పడేలా చేస్తాను.నన్ను రాజ్ తరుణ్ మోసం చేసాడు.
నన్ను బజారున పడేసాడు అంటూ లావణ్య రాజ్ తరుణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.దీంతో మరొకసారి ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







