ఇటీవల కాలంలో అక్రమ సంబంధాలు,( Illegal Affairs ) అనైతిక ప్రేమ వ్యవహారాలు సామాజిక విలువలను కల్లోలం చేస్తున్నాయి.కుటుంబ వ్యవస్థ పైనే ప్రశ్నలు లేవనెత్తేలా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
భార్య భర్తల మధ్య మనస్పర్థలు, గృహ హింసలు ఒకవైపు.మానసిక అసంతృప్తి మరోవైపు కలిసిపోయి కుటుంబాలు చెదిరిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లోని( Uttar Pradesh ) అలీఘర్లో చోటు చేసుకుంది.
అలీఘర్కు చెందిన స్వప్న( Swapna ) అనే మహిళ, తన కాబోయే అల్లుడు రాహుల్తో కలిసి పారిపోయిన ఘటన పెద్ద సంచలనంగా మారింది.
వీరిద్దరూ ఏప్రిల్ 6న ఇంట్లో నుంచి కనిపించకుండా పోగా, పదిరోజుల తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయారు.పోలీసుల విచారణలో స్వప్న సంచలన విషయాలు వెల్లడించింది.తన భర్త జితేంద్ర కుమార్ రోజు మద్యం తాగి రావడంతో పాటు, తాను కొట్టేవాడనీ.కుమార్తె కూడా తరచూ గొడవపడేదనీ, ఈ పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు రాహుల్తో( Rahul ) పారిపోవాల్సి వచ్చిందని ఆమె చెప్పింది.
జీవితం ఇక రాహుల్తోనే కొనసాగించాలని తేల్చిచెప్పింది.తనతో కేవలం మొబైల్ ఫోన్, రూ.200 మాత్రమే తీసుకెళ్లానని చెప్పింది.

రాహుల్ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.స్వప్న తనను బెదిరించిందని, రాకపోతే చచ్చిపోతానని చెప్పిందని వివరించాడు.భయంతోనే ఆమెతో వెళ్లానని చెప్పాడు.
తాను స్వప్నను పెళ్లి చేసుకుంటానా? అన్న ప్రశ్నకు మాత్రం స్పష్టత ఇవ్వకుండా, “తర్వాత చూస్తా” అంటూ దాటవేశాడు.ఇక ఈ ఘటన ఇరువైపుల కుటుంబాలను షాక్కు గురి చేసింది.
స్వప్న భర్త జితేంద్ర మాట్లాడుతూ, ఆమె తరచూ రాహుల్తో ఫోన్లో గంటల తరబడి మాట్లాడేదని ఆరోపించాడు.స్వప్న సోదరుడు దినేష్ మాట్లాడుతూ.
తమ్ముడి ఇంట్లో నెలల తరబడి ఆమెతో కలిసి ఉన్నానని, అక్కను కొట్టిన ఘటనలు ఎప్పుడూ చూడలేదని వివరణ ఇచ్చాడు.ఆమెపై చర్యలు తీసుకోవాలని, తీసుకెళ్లిన నగలు, డబ్బును తిరిగి ఇవ్వాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

పోలీసులు మాత్రం ఈ కేసుపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.అయితే ఇది కుటుంబ సంబంధాలను, నైతికతను ప్రశ్నించే సంఘటనగా మారింది.కుటుంబ వ్యవస్థలో శాంతి భద్రతలు క్షీణించినపుడు, ఇటువంటి దారుణాలు ఎలా జరుగుతాయో ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది.