మీరు ఓటు ఎవరికి వేసారు! బెట్టింగ్ ముఠాల నయా ప్లాన్!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిపోయిన.ఇంకా ప్రజలపై రాజకీయ నాయకులు పెత్తనం మాత్రం పోలేదు.

 Political Bettings In Andhra Pradesh-TeluguStop.com

మరోవైపు రాజకీయాలలో నేతలపై బెట్టింగ్ లు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి.ముఖ్యంగా ప్రధాన నాయకులు, కచ్చితంగా గెలుస్తారని అనుకున్న వారిపైనా, అంచనాలకి అందని నేతల మీద బెట్టింగ్ ముఠాలు జోరుగా బెట్టింగ్ లకి తెరతీసాయి.

ఒకటికి పది అంటూ ఆశ పెడుతున్నాయి.అలాగే అధికార, ప్రతిపక్ష రాజకీయ నేతలు ఈ బెట్టింగ్ లలో జోరుగా పాల్గొంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఈ పొలిటికల్ బెట్టింగ్ ల కోసం బెట్టింగ్ ముఠాలు ప్రజలకి ఫోన్ చేసి పోస్ట్ పోల్ సర్వ్ అని చెబుతూ మీరు ఎవరికి ఓటు వేసారు అని అడుగుతున్నట్లు తెలుస్తుంది.ఇలా ప్రజల నుంచి వచ్చే సమాచారం బట్టి నేతలపైన బెట్టింగ్ లని షురూ చేస్తున్నట్లు తెలుస్తుంది.

బెట్టింగ్ ముఠాల ఫోన్ కాల్స్ ఎక్కువగా లోకేష్ పోటీ చేసిన మంగళగిరి, అలాగే పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక, భీమవరంలో ఎక్కువగా వస్తున్నాయని తెలుస్తుంది.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ పలానా చోట ఓడిపోతాడు అంటూ బెట్టింగ్ లు ఎక్కువగా నడుపుతున్నారని టాక్ వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube