టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలవడంతో తన నెక్ట్స్ మూవీని ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తాడా అని మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.ఇక ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ను ఎట్టకేలకు మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు.
మహేష్ బాబు 27వ చిత్రం ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్తో దర్శకుడు పరశురామ్ డైరెక్షన్లో రానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ను చిత్ర యూనిట్ ఈ సందర్భంగా రిలీజ్ చేశారు.
అయితే పరశురామ్ లాంటి చిన్న చిత్రాల డైరెక్టర్ మహేష్ బాబు సినిమాను ఏ విధంగా హ్యాండిల్ చేయగలడనే ప్రశ్న అందరిలో మొదలైంది.అసలు పరశురామ్ ఇప్పటివరకు ఏ ఒక్క స్టార్ హీరోతో సినిమా చేయలేదు.
మరి వరుస విజయాలతో దూసుకెళ్తున్న టాలీవుడ్ నెంబర్ వన్ హీరోను ఆయన ఎలాంటి కథతో మెప్పించాడు అనే సందేహం కూడా అందరిలో మొదలైంది.అయితే ప్రేక్షకుల అనుమానాలను పటాపంచలు చేస్తూ పరశురామ్ మహేష్ కోసం అదిరిపోయే సినిమాను లైన్లో పెట్టాడని నిరూపించుకున్నాడు.
‘సర్కారు వారి పాట’ అనే అదిరిపోయే టైటిల్తో పాటు మహేష్ అల్ట్రా మోడ్రన్ లుక్ను డిజైన్ చేసిన విధానంతో పరశురామ్ ఈ సినిమాను ఏ రేంజ్లో తెరకెక్కించనున్నాడో మనకు సాంపిల్ చూయించాడు.మహేష్ బాబు సినిమా అంటే ఆషామాషి కాదని, అందుకు తగ్గట్టుగానే తాను ప్రిపేర్ అయ్యానని పరశురామ్ అదిరిపోయే జవాబిచ్చాడు.
మొత్తానికి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయిన పరశురామ్ చిత్ర అనౌన్స్మెంట్తోనే తొలి టెస్టును డిస్టింక్షన్లో పాస్ అయ్యాడని చెప్పొచ్చు.