గోధుమ ద్వారా తీసిన గోధుమ రవ్వ వల్ల ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా శరీర బరువు కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.ఇందులో అధిక మొత్తంలో ఫైబర్, విటమిన్ బి ఉంటాయి.
అంతే కాకుండా గోధుమ రవ్వ వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.గోధుమ రవ్వతో చేసిన పదార్థాన్ని పాలిచ్చే తల్లులు పాలలో కలిపి తీసుకోవాలి.
కొందరికి గోధుమ రవ్వ జీర్ణ వ్యవస్థ( Digestive system )కు ఆటంకం కలిగిస్తుంది.అలాంటి వారు కొన్ని రోజులు దానిని తినడం ఆపడమే మంచిది.
గోధుమ రవ్వ తో చేసిన ఆహార పదార్థలను క్రమం తప్పకుండా తింటూ ఉంటే శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
అంతే కాకుండా గోధుమ రవ్వ పదార్థాన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.గోధుమ రవ్వతో చేసిన పదార్థాలకు వాంతులను నిరోధించే శక్తి ఉంటుంది.అలాగే గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తినడం వల్ల అధిక బరువు తగ్గి శరీర బరువు అదుపులో ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తినడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి.అలాగే శరీరంలో ఉన్న నొప్పులు కూడా తగ్గిపోతాయి.ఇంకా చెప్పాలంటే గోధుమ రవ్వ పదార్థాలు హిమోగ్లోబిన్ ( Hemoglobin )స్థాయినీ పెంచడంలో కూడా ఎంతగానో ఉపయోగపడతాయి.అంతే కాకుండా చర్మాన్ని మెరిసేలా చేయడంలో గోధుమ రవ్వ ఆహార పదార్థాలు ఎంతగానో ఉపయోగపడతాయి.
ఇంకా చెప్పాలంటే గోధుమ రవ్వ వంటకం వ్యాధి నిరోధక శక్తి( Immune System )ని పెంచుతుంది.అలాగే చలి కాలంలో గోధుమ రవ్వ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల చలి తీవ్రతను దూరం చేసుకోవచ్చు.అలాగే సీజనల్ వ్యాధుల నుంచి కూడా దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.గోధుమ రవ్వ ఆహార పదార్థాలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.