ఈ మధ్య ఆడపిల్లలపై ఎలాంటి అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయో చూస్తూనే ఉన్నాం.అర్థరాత్రి దాడులు జరగడమేమో కానీ ఈ మధ్య పట్టపగలే ఇలాంటి దారుణాలు పెరిగిపోతున్నాయి.
అందుకే ఆడపిల్ల బయటకు వెళ్లిందంటేనే తల్లిదండ్రులు ఆమె వచ్చే వరకు ఎలా ఇంటికి చేరుకుంటుందో అని భయపడిపోతున్నారు.ఇక కొన్ని సార్లు అమ్మాయిలు కూడా కావాలనే తమను ఏదో చేశారని ఫేక్ కంప్లయింట్లు ఇవ్వడం కూడా చూస్తున్నాం.
చివరకు అందులో నిజం లేదని తెలియడంతో జనాల్లో వారు చులకన అయిపోతున్నారు.ఇక ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.
తనపై కొందరు ఆటోడ్రైవర్లు కిడ్నాప్ చేసి ఆ తర్వాత దారుణంగా గ్యాంగ్ రేప్ జరిపారంటూ పోలీసులకు సంచలన ఫిర్యాదు చేసింది ఓ యువతి.తాను నడుచుకుంటూ వెళ్తుండగా సైదాబాద్ ప్రాంతంలోని సంతోష్ నగర్లో కావాలనే తనను బలవంతంగా కొందరు ఆటోడ్రైవర్లు ఈడ్చుకెళ్లి పహాడీ షరీఫ్ ఏరియాలో ఎవరూ లేని టైమ్ చూసి దారుణంగా అత్యాచారం చేశారని ఫిర్యాదు ఇచ్చింది.
అయితే రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేయడంలో భాగంగా ఆ ఏరియాలోని సీసీటీవీ ఫుటీజీలను క్షుణ్ణంగా రిశీలించారు.అంతే కాదు 3 ప్రత్యేక బృందాలుగా మారి విచారణ చేశారు.
అయితే దర్యాప్తు చేస్తుండగా సంచలన విషయాలు బయటపడ్డాయి.అసలు బాధితురాలు చెప్పినవన్నీ అబద్ధాలే అంటూ నిర్ధారణకు వచ్చారు.ఆమె చెప్తున్న విషయాలకు వాస్తవంగా అక్కడ జరిగిన సన్నివేశాలకు సంబంధం లేకపోవడంతో గట్టిగా అడగ్గా అసలు విషయం చెప్పింది.తాను ప్రేమిస్తున్న వ్యక్తికి వివాహం నిశ్చయం కావడంతో ఎలాగైనా అతడిని ఈ కేసులో ఇరికించి తనను పెండ్లి చేసుకునేలా చేయాలనే ప్లాన్తోనే ఇలా ఫేక్ కంప్లయింట్ ఇచ్చిందని తెలుస్తోంది.
దీంతో పోలీసులు షాక్ కు గురయ్యారు.ఈ వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.