ఎండు ఖర్జూరం.ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఎంతో తియ్యగా ఉండే ఎండు ఖర్జూరాలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు.స్వీట్ల తయారీలో కూడా ఎండు ఖర్జూరాలను ఉపయోగిస్తుంటారు.
ఇక పిల్లల నుంచి పెద్దల వరకు తినగలిగే ఆహారంలో ఎండు ఖర్జూరం కూడా ఒకటి.అంతేకాదు, వీటి వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మరి అవేంటో అస్సల లేట్ చేయకుండా తెలుసుకుందాం.బాగా అలసటగా ఉన్నప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు ఎండు ఖర్జూరాలను నీటిలో నానాబెట్టి.అనంతరం జ్యూస్లా చేసుకుని తాగితే తక్షణ శక్తి లభిస్తుంది.రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ ఖర్జూరం అద్భుతంగా సహాయపడుతుంది.
అందుకు ప్రతి రోజు తేనెలో నాన బెట్టిన ఖర్జూరం తీసుకోవాలి.లేదా రోజుకు రెండు, మూడు ఖర్జూరాలను డైలీ డైట్లో చేర్చుకున్నా శరీర రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.
ప్రస్తుతం ప్రాణాంతక కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందుతున్న సంగతి తెలిసిందే.ఈ సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అలాగే తేనెతో ఖర్జూరం తీసుకోవడం దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పొటాషియం కూడా ఎండు ఖర్జూరంలో లభిస్తుంది.
అంతేకాకుండా.
మెగ్నీషియం, కాపర్ మరియు ఐరన్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి.ఇవి ఎముకలను దృఢంగా మారడానికి సహాయపడతాయి.
రక్తహీనత సమస్య నుంచి బయటపడేస్తుంది.ఎండు ఖర్జూరాల వల్ల మరో ప్రయోజనం ఏంటంటే.
రక్తపోటును అదుపులో ఉంచుతుంది.ఇక ఇందులో కొలస్ట్రాల్ కూడా ఉండదు.
కాబట్టి, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు రెండు, మూడు చప్పున తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.