ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సన్మానం

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో (Mandal Parishad Primary School )విధులు నిర్వహించి బదిలిపై వెళ్ళిన కంకణాల కవిత, పిట్టల పూర్ణిమ లను పాఠశాల ఉపాధ్యాములు, విద్యార్థులచే , అమ్మ ఆదర్శ పాఠశాల కమిటి సభ్యులచే సోమవారం ఘనంగా వీడ్కోలు సన్మానం చేశారు.ప్రధానిపాధ్యాయురాలు ఎలిగేటి శ్రీలత మాట్లాడుతూ.

 A Solemn Farewell Honor-TeluguStop.com

గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి సన్మార్గంలో నడిపించి వీడ్కోలు తీసుకుంటున్న ఉపాధ్యాయులను అభినందించారు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ మాట్లాడుతూ.ఉపాధ్యాములు ఎప్పుడు నిత్య విద్యార్థి వలె ఉన్నప్పుడే సమాజములో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయని విద్యార్థులు మనపై చెరగని ముద్ర వేసుకున్న శక్తి ఒక ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుందని చెప్పారు.

కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లకావత్ రవి, మహేష్, జి సురేష్, మాజీ ఎస్ఎంసి చైర్మెన్ బోరుగాయ తిరుపతి, ఉపాధ్యాయులు ఎడ్ల కిషన్ , పాము వెంకటేశ్వర్లు , జక్కని మమత, సిఅర్పి అందాసు ఉమ.విద్యా వాలంటీర్లు మమత, వరలక్ష్మి శ్యామల తదితరులు పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube