నేతన్న భీమా పథకము

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చేనేత, మరమగ్గాల కార్మికులకు మరియు అనుబంధ కార్మికులకు తెలియజేయునది ఏమనగా, రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం నేతన్నకు భీమా పథకమును ప్రవేశపెట్టినది.ఇట్టి పథకములో చేరడానికి చేనేత మరియు మరమగ్గాల కార్మికులు,అనుబంద కార్మికులు అనగా డైయింగ్, డిజైనింగ్, వార్ఫింగ్, వైన్డింగ్, సైజింగ్, వైపని, బ్లీచింగ్, రోలింగ్ (గమ్మింగ్) కార్మికులు అర్హులు.గత సంవత్సరం ఈ పథకంలో చేరని చేనేత మరియు మరమగ్గాల కార్మికులు చేనేత మరియు జౌళి శాఖ కార్యాలయంలో తేదీ 08.08.2024 లోగా దరఖాస్తు చేసుకోగలరు.

 Netanna Bheema Scheme Details, Netanna Bheema Scheme , Rajanna Sircilla District-TeluguStop.com

ఇట్టి పథకంలో నమోదు అయిన కార్మికులు ఏదైనా కారణాల చేత మరణించినట్లయితే అట్టి కుటుంబానికి రూ.5.00 లక్షల బీమా వస్తుంది.18-59 సం.వయస్సు కల్గిన కార్మికులు మరియు అనుబంధ కార్మికులు వారి పాస్ పోర్ట్ సైజ్ పోటో, అధార్ కార్డ్,బ్యాంకు ఖాతా జిరాక్స్,నామిని ఆధార్ కార్డ్,బ్యాంకు ఖాతా జిరాక్స్ తో చేనేత,జౌళి శాఖ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించగలరు.ఎవరైనా అర్హులైన చేనేత,మరమగ్గాల కార్మికులు నేతన్న భీమ పథకంలో చేరుటకు చేనేత, జౌళి శాఖ కార్యాలయంలో తేదీ 08.08.2024 లోగా దరఖాస్తు చేసుకోగలరు.ఇతర వివరముల కొరకు చేనేత మరియు జౌళి శాఖ కార్యాలయంలో సంప్రదించగలరని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube