రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో గత కొద్ది రోజులుగా కొన్ని కిరాణం షాపులలో రేషన్ బియ్యం అక్రమంగా అమ్ముతున్నట్లు వేములవాడ టౌన్ పోలీస్ వారికి సమాచారం వచ్చిందని, కావున ప్రభుత్వం ప్రజలకు సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం ను
ఎవరైనా తమ కిరాణా షాపులలో అక్రమంగా నిల్వ ఉంచి అమ్మినట్లు అయితే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు అని వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ O.వెంకటేష్ ఓ ప్రకటనలో తెలిపారు.