రాజన్న సిరిసిల్ల జిల్లా: రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి జాతర మహోత్సవానికి మాజీ జెడ్పిటిసి పుర్మాని మంజుల రామ్ లింగారెడ్డి 5016/- రూపాయల విరాళం.మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగే జాతర మహోత్సవానికి మాజీ జెడ్పిటిసి పూర్మాని మంజుల రామ్ లింగారెడ్డి 5016/- రూపాయల విరాళం అందజేశారు.
ఈ సందర్భంగా మహాశివరాత్రి రోజు బస్వాపూర్ లో జరిగే జాతర మహోత్సవానికి గ్రామస్తులు,భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకోవాలని భక్తులను కోరిన మాజీ జెడ్పిటిసి దంపతులు.రామలింగేశ్వర స్వామి జాతర మహోత్సవానికి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తమ వంతు విరాళం అందజేసిన మాజీ జెడ్పిటిసి మంజుల రామ్ లింగారెడ్డి దంపతులకు కృతజ్ఞతలు తెలిపిన బస్వాపూర్ గ్రామస్తులు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.