రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట జామియా మస్జిద్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.జామియా మస్జిద్ కమిటీ అధ్యక్షులుగా రఫిక్, యూత్ అధ్యక్షులుగా మొహమ్మద్ రిజ్వాన్ లను కమిటీ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అలాగే ఉపాధ్యక్షులు జహంగీర్, ప్రధాన కార్యదర్శిగా లాల్ మొహమ్మద్, కోశాధికారిగా అహ్మద్, కార్యదర్శిగా బాబా, సలహాదారుడిగా డాక్టర్ హైమద్ లను ఎన్నుకున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు రఫీక్ ఖాన్, మహమ్మద్ రిజ్వాన్ మాట్లాడుతూ జామియా మస్జిద్ కమిటీ అభివృద్ధి కొరకు పాటుపడతామని నూతనంగా ఎన్నికైన సభ్యులను కలుపుకొని పోయి అందరి సహాయ సహకారాలతో ముందుకు సాగుతామని తెలిపారు.
అలాగే అందరి కష్టసుఖాల్లో పాలుపంచుకొని కమిటీ ఆధ్వర్యంలో నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా వారు అన్నారు.తమ ఎన్నికకు సహకరించినటువంటి జామియా మస్జిద్ కమిటీ సభ్యులకు, పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.