రాజన్న సిరిసిల్ల జిల్లా :డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీ.ఈ.
ఈ.టీ) లో విద్యార్థుల వివరాల నమోదుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో డీ.ఈ.ఈ.టి యాప్ పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీ.ఈ.ఈ.టీ) ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని, ఇందులో నమోదైతే విద్యార్థులకు ఉన్న నైపుణ్యాల అర్హత ప్రకారం ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగ అవకాశాల వివరాలు తెలుస్తాయని, నిరుద్యోగులకు పరిశ్రమలకు వారధిగా ఇది పనిచేస్తుందని అన్నారు.
ఐ.టి.ఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఇతర ఉపాధి కోర్సులు చదివిన విద్యార్థులు డీ.ఈ.ఈ.టి లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ & ప్రైవేటు రంగంలో ఉపాధి పొందే అవకాశాలు మెరుగు అవుతాయని అన్నారు.
సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఐటిఐ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పాసైన విద్యార్థుల వివరాలను 15 రోజులలో డీ.ఈ.ఈ.టి లో నమోదయ్యే లా చూడాలని అన్నారు.ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు , ఇతర ఉపాధి కోర్సుల కళాశాలలో, ఎంబీఏ కాలేజి విద్యార్థులు కూడా నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టాలని అన్నారు.
ప్రైవేట్ రంగంలోనే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే నోటిఫికేషన్ లో అర్హత కలిగిన ఉద్యోగాల వివరాలు కూడా విద్యార్థులకు చేరవేసేందుకు డీ.ఈ.ఈ.టీ ఉపయోగపడుతుందని అన్నారు.
ఈ సమావేశంలో జి.ఎం.ఇండస్ట్రీ హనుమంతు సంబంధిత ఇతర శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.