రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో అనరసి నర్సింహులు ఇంట్లో గుడుంబా అమ్ముతున్నారని సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగి గుడుంబా స్వాధీనం చేసుకున్నారు.గుడుంబా ప్యాకెట్లు సుమారు 25 ప్యాకెట్లుగా గుర్తిస్తున్నారు.
ఆనరాసి నర్సింహులు అక్రమంగా గుడుంబా అమ్ముతున్నారని వారింట్లో సోదాలు చేయగా 11 గుడుంబా ప్యాకెట్లు దొరికాయి.అలాగే ఆనారాసి రామవ్వ ఇంట్లో అక్రమంగా గుడుంబా అమ్ముతున్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు మొత్తం 25 గుడుంబా ప్యాకెట్ స్వాధీనం చేసుకున్నారు.
ఎవరైనా అక్రమంగా గుడుంబా ప్యాకెట్లు అమ్మడం గాని కొనడం గాని చేస్తే చట్టరీత్యా నేరం దీనికి కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.