బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) మరికాసేపటిలో తెలంగాణభవన్ కు వెళ్లనున్నారు.కృష్ణా పరివాహక ప్రాంతంలోని ఐదు ఉమ్మడి జిల్లాల బీఆర్ఎస్ నేతలతో ఆయన సమావేశం కానున్నారు.
ఈ క్రమంలో సుమారు 57 నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు మరియు పార్టీ కీలక నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
కాగా ఈ సమావేశంలో ప్రధానంగా కేఆర్ఎంబీకి నీటి ప్రాజెక్టుల అప్పగింతపై బీఆర్ఎస్( BRS ) నిరసన కార్యాచరణ రూపొందించనుంది.ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా( Nalgonda District )లో నిరసన సభ నిర్వహించాలని యోచనలో ఉంది.ఇందుకు సంబంధించి ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.