శిఖర్ ధావన్ అరుదైన ఖాతాలో మరో అరుదైన రికార్డ్..

సోమవారం అంటే నిన్న పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ మధ్య ఒక మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్ సందర్భంగా బ్యాటర్ శిఖర్ ధావన్ ఒక అరుదైన రికార్డును నెలకొల్పాడు.

 Another Rare Record In Shikhar Dhawan's Rare Account Shikar Dhawan, New Record,-TeluguStop.com

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్‌పై మొత్తం 1029 పరుగులు నమోదు చేసి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు చేసిన నంబర్ వన్ ఆటగాడిగా నిలిచాడు.తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ డేవిడ్ వార్నర్ ఉన్నారు.

ఈ జాబితాలో కోల్‌కతాపై 1018 స్కోరు చేసిన రోహిత్ సెకండ్ ప్లేస్ తో సరిపెట్టుకోగా, పంజాబ్‌పై వార్నర్ 1005 పరుగులు చేసి థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు.

ఇక శిఖర్ ధావన్ తాజాగా ఐపీఎల్‌లో 200వ మ్యాచ్ ఆడి ఏకంగా 6000 పరుగులు చేసి తన సత్తా చాటాడు.దీనితో ఐపీఎల్‌లో హైయెస్ట్ రన్స్ చేసిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ తరువాత ప్లేస్ ని ధావన్ సొంతం చేసుకున్నాడు.207 మ్యాచ్‌ల్లో కోహ్లీ 6,402 పరుగులు చేయగా, శిఖర్ ధావన్ 200 మ్యాచ్‌ల్లో 6086 పరుగులు చేశాడు.ఆ తర్వాతి ప్లేసుల్లో రోహిత్ శర్మ (5764), వార్నర్ (5668) ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి.నిన్న వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ధావన్ 9 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 88 పరుగులతో టాప్ స్కోరర్‌గా రాణించాడు.ఈ హాఫ్ సెంచరీతో హైయెస్ట్ హాఫ్ సెంచరీల లిస్టులో శిఖర్ ధావన్ సెకండ్ ప్లేస్ సంపాదించాడు.57 హాఫ్ సెంచరీలతో డేవిడ్ వార్నర్ ఫస్ట్ ప్లేసులో ఉండగా, శిఖర్ ధావన్ 48 హాఫ్ సెంచరీలతో సెకండ్ ప్లేసులో నిలిచాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube