ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా రాధే శ్యామ్.ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో 250 కోట్ల పైగా బడ్జెట్ తో రూపొందించారు.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటించింది.పీరియాడికల్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమా ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో మెప్పించగా మార్చ్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక లేటెస్ట్ గా సినిమా క్రేజ్ మరింత పెంచేలా రాధే శ్యామ్ సినిమాకు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ కూడా యాడ్ చేస్తున్నారట.
సినిమా మొదలయ్యే టైం లో అమితాబ్ వాయిస్ ఓవర్ సినిమాకు హెల్ప్ అవుతుందని అంటున్నారు.
ఈ విషయాన్ని చిత్రయూనిట్ లేటెస్ట్ గా ప్రకటించారు.అమితాబ్ వాయిస్ ఓవర్ రాధే శ్యామ్ కి నిజంగానే బాగా సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు.
బిగ్ బీ అమితాబ్ ఆల్రెడీ ప్రభాస్ తో ప్రాజెక్ట్ కె సినిమాలో నటిస్తున్నాడు.నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది.
ఇదే కాదు సలార్, ఆదిపురుష్ సినిమాలు కూడా ప్రభాస్ లైన్ లో పెట్టాడు.