ఒకప్పుడు టాలీవుడ్ కే పరిమితమైన ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాకింది.ఇందులో ఎటువంటి సందేహం లేదు.
ప్రభాస్ గురించి చెప్పాలంటే బాహుబలికి ముందు ప్రభాస్, బాహుబలి తరువాత ప్రభాస్ అనేంతలా ప్రభాస్ లైఫ్ మారిపోయింది.బాహుబలి బ్లాక్ బస్టర్ హిట్ తో ఒక్కసారిగా టాలీవుడ్ రికార్డులన్నీ చెదిరిపోయాయి.
టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ రికార్డులు కూడా చెదిరిపోయాయి.దీంతో ప్రభాస్ కు బాలీవుడ్ లో సైతం మార్కెట్ పెరిగింది.
అందుకే ఇప్పుడు ప్రభాస్ చేసే సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో ఉండడం గమనార్హం.అయితే సాలార్ తరువాత ప్రభాస్ చేస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ఆది పురుష్.
అయితే ప్రభాస్, అజయ్ దేవగన్ లాంటి భారీ తారాగనంతో రామాయణం స్టోరీ ఒక సినిమా రూపంలో రాబోతుంది.అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా వచ్చిన ఓ అప్డేట్ ఆసక్తి కలిగిస్తోంది.
ప్రభాస్ కు జోడీగా సీత పాత్రలో కృతి సనన్ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.అయితే కృతి సనన్ ఎంపిక వెనుక బాలీవుడ్ స్టార్ హీరో చక్రం తిప్పారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం అంతగా సినిమాలు లేని కృతి సనన్ ను సీత పాత్రకు అజయ్ దేవగన్ రికమెండ్ చేశారని తెలుస్తోంది.ఏది ఏమైనా అత్యంత భారీగనం తో చిత్రీకరణ జరుకుంటున్న ఆది పురుష్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.