మనిషికి ఎలాగో మని విలువ తెలియదు.కనీసం ప్రాణం విలువ అయినా తెలుసుకుంటే బాగుండేది.
ఎందుకంటే ఎదురయ్యే సమస్యల ముందు ధైర్యంగా నిలబడ లేక చావు అనే మార్గాన్ని వెతుక్కుంటున్నాడు.
నేడు సమాజంలో అన్ని సమస్యలకు మరణం పరిష్కార మార్గంగా భావిస్తున్నాడు.
చిన్న చిన్న తగాదలకు కూడా చావే దిక్కు అనేలా ప్రవర్తిస్తున్నారు.ఇకపోతే భర్తతో గొడవపడిన ఓ మహిళ తన 8 నెలల పాపతో కలిసి భవనం పై నుండి దూకేసింది.
హైదరాబాద్లోని జూబ్లిహిల్స్లో జరిగిన ఈ విషాద ఘటనలో ఆ తల్లి చనిపోగా, పపిపాప ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.ఆ వివరాలు తెలుసుకుంటే.
బీహార్కు చెందిన భీమల్ కుమార్, ఆర్తి అనే భార్య భార్తలు.తమ 8 నెలల పాపతో కలసి నగరంలో జీవనోపాధి పొందుతూ, జూబ్లిహిల్స్లోని ఓ ఇంట్లో అద్దెకు నివసిస్తున్నారు.
కాగా కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని సమాచారం.
ఈ నేపధ్యంలో భర్త, ఆర్తి పై చేయి చేసుకున్నాడన్న మనస్థాపనంతో ఆర్తి ఆత్మహత్య చేసుకుంది.
ఇకపోతే ఆ చిన్నారి పరిస్థితి కూడా విషమంగా ఉందంటున్నారట వైద్యులు.కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారట.