ఇటీవల పాదయాత్ర చేసుకుని శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చారపురం భారీ బహిరంగ సభలో మాట్లాడిన వైసీపీ అధినేత జగన్ అనేక హామీలు… సంక్షేమ పథకాలు ప్రకటించారు.అయితే ఈ వీటిపై టీడీపీ కౌంటర్ కూడా వేసింది.
ఈ మేరకు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్యెల్యేలతో ఓ భారీ బహిరంగ లేఖ కూడా రాయించింది.ఈ లేఖలో వారు జగన్ మీద అనేక అనేక ఆరోపణలు కూడా చేసిన సంగతి తెలిసిందే.
అయితే దీనిపై ఇప్పుడు గుడివాడ వైసీపీ ఎమ్యెల్యే కొడాలి నాని ఘాటుగా స్పందించారు.

వారంతా గొర్రెలు అంటూ మండిపడ్డారు.అంతే కాదు అసలు ఆ లేఖ రాసింది చంద్రబాబు అని.కాకపోతే అందులో సంతకాలు చేసింది మాత్రం అమ్ముడుపోయిన గొర్రెలు అని నాని విమర్శించారు.వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో కొందరిని సంతలో గొర్రెల్లా చంద్రబాబు కొనుగోలు చేశాడని, వారితో జగన్కు లేఖ రాయించాడని మండిపడ్డారు.