ఇటీవలే కాలంలో వివాహేతర సంబంధాలు( Illegal Affairs ) అన్ని చివరకు విషాదంగా ముగుస్తున్నాయి.వివాహేతర సంబంధాలు బయటపడినప్పుడు హత్యకు గురికావడం లేదంటే ఆత్మహత్యకు పాల్పడం లాంటిది జరిగి కుటుంబాలు నాశనం అవుతున్నాయి.
వివాహేతర సంబంధాలు పెట్టుకుని తమ జీవితాలను తామే నాశనం చేసుకుంటున్నారు.ఈ కోవకు చెందిన ఓ సంఘటన అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళితే. అనంతపురం జిల్లా( Anantapuram )లోని రాయదుర్గంలో కుత్తీస్ అలియాస్ పృథ్వీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.అయితే అదే ప్రాంతానికి చెందిన ఓ వివాహితతో కుత్తీస్ కు పరిచయం ఏర్పడి చివరికి వివాహేతర సంబంధానికి దారితీసింది.ఇక ఇద్దరూ కలిసి సన్నిహితంగా ఫోటోలు దిగడం, ఫోన్లలో మెసేజ్ లు చేసుకోవడం లాంటివి చేశారు.
కొంతకాలానికి వీరి వివాహేతర సంబంధానికి బ్రేక్ పడి, మనస్పర్ధలతో ఇద్దరి మధ్య తగాదాలు జరిగాయి.అప్పటినుంచి ఆ వివాహిత ఫోటోలతో, మెసేజ్ లతో బ్లాక్ మెయిల్( Blackmail ) చేయడం మొదలుపెట్టింది.
దీంతో కుత్తీస్ చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.అ వివాహిత తననే కుత్తీస్ వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.ఈ క్రమంలో ఆ వివాహిత వారం రోజుల క్రితం స్పందనలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇద్దరినీ విచారించి, తదుపరి విచారణకు శనివారం రావాలని చెప్పారు.
అయితే గురువారం రాత్రి ఆ వివాహిత కుత్తీస్ ను తన ఇంటికి రమ్మని వేరే వ్యక్తితో కబురు పంపింది.కుత్తీస్ భార్య లలిత ఆ వివాహిత వద్దకు వెళ్లేందుకు నివారించి, శుక్రవారం పెళ్లికి వెళ్లి వచ్చాక శనివారం విచారణకు వెళ్దామని భర్తకు చెప్పింది.కానీ కుత్తీస్ భార్య మాట వినకుండా ఆ వివాహితను కలిసేందుకు వెళ్లాడు.కుత్తీస్ భార్య శుక్రవారం పెళ్లికి బయలుదేరింది.మార్గ మధ్యలో ఉండగానే భర్త ఉరేసుకుని చనిపోయాడనే వార్త తెలిసి హుటాహుటిన ఇంటికి వచ్చి భర్త శవాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది.
తన భర్త కుత్తీస్ ఆత్మహత్యకు ఆ వివాహిత వేధింపులే కారణం అని పోలీసులకు ఫిర్యాదు చేసి పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని నిరసన తెలిపింది.
పోలీసులు కుత్తీస్ భార్యను నచ్చజెప్పి ఆ వివాహితపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.