బుల్లితెర నటుడు దిలీప్ జోషి దీపావళి పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈయన దీపావళి పండుగ సందర్భంగా ఖరీదైన కారును కొనుగోలు చేశారు.
కియా సోనెట్ సబ్కాంపాక్ట్ ఎస్యూవీ మోడల్ను కొన్నారు.సుమారు 13 లక్షల విలువచేసే ఈ కారును కొనుగోలు చేసిన నటుడు దిలీప్ జోషి ఎంతో సంతోషంతో కారు ముందు తన కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
దిలీప్ జోషి ప్రస్తుతం తారక్ మెహతా కా ఉల్టా చష్మా సీరియల్తో చిన్నపాటి స్టార్గా మారిపోయారు.ప్రస్తుతం ఇతనికి ఎన్నో అవకాశాలు వస్తున్నప్పటికీ తనకు మాత్రం ఈ సీరియల్ ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పుకొచ్చారు.2008లో ప్రారంభమైన ఈ సీరియల్ ఇప్పటికీ కొనసాగుతూ విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుందని చెప్పవచ్చు.
ఇలా బుల్లితెర నటుడిగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న దిలీప్ దీపావళికి తనకెంతో ఇష్టమైన కారును కొనుగోలు చేశారు.ప్రస్తుతం కారుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పలువురు నటీనటులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం దిలీప్ కుటుంబం తన కుటుంబంతో కలిసి కారుతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్ గా మారాయి.