తల్లిదండ్రులకు షాకిచ్చిన కుమారుడి కిడ్నాప్ ఉందంతం.. !

మూడేళ్ల క్రితం కిడ్నాప్ కు గురైన కొడుకు ఆచూకీ సడెన్‌గా దొరికితే ఆ తల్లిదండ్రుల కళ్లల్లో కలిగే ఆనందం మాటల్లో చెప్పలేము.అసలు పోయిన పిల్లలు తిరిగి ఇంటికి చేరడం అనేది దాదాపుగా జరగదు.

 Kamareddy, Bharatnagar Colony, Unexpected Twist, Son, Kidnapping Case-TeluguStop.com

అలాంటిది తన కొడుకు కిడ్నాప్‌కు గురై ప్రాణాలతో ఉన్న విషయం నమ్మశక్యం కాదు ఎవరికైనా.కానీ ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

ఆ వివరాలు చూస్తే.కామారెడ్డి పట్టణంలోని భరత్‌నగర్‌ కాలనీకి చెందిన గోపి, ఉమ దంపతుల రెండో కుమారుడు గణేశ్ 2018 ఏప్రిల్‌ 13న ‌ఇంటి ముందు ఆడుకుంటూ కనబడకుండా మాయం అయ్యాడు.ఆ తర్వాత కిడ్నాప్ చేసిన ఆ ముఠా ఆ బాలున్ని మరో మహిళ ద్వారా హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ ప్రాంతంలో రూ.1.50 లక్షలకు విక్రయించారట.

ఇలా మూడు సంవత్సరాలు గడచి పోయాయి.

ఈ క్రమంలో మూడు రోజుల క్రితం కిడ్నాప్ చేసిన వ్యక్తే బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కొడుకు బ్రతికే ఉన్నాడని, అతను ఫలనా చోటులో ఉన్నాడని తెలపడంతో పట్టరాని ఆనందంలో మునిగిపోయిన ఆ తల్లిదండ్రులు వెంటనే పోలీసుల సహయంతో తమ కుమారున్ని తమ వద్దకు తీసుకొచ్చుకున్నారట.నిజంగా ఇది వారి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం.

ఎందుకంటే మూడేళ్ల క్రితం కిడ్నాప్ కు గురైన బాలుడి సమాచారం అనూహ్యంగా లభించడం అనేది సర్వసాధారణమైన విషయం కాదు కాబట్టి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube