తెలుగులో ప్రముఖ దర్శకుడు “మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి” దర్శకత్వం వహించిన “అంతకు ముందు ఆ తర్వాత” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన తెలుగమ్మాయి “ఈషా రెబ్బ” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటన పరంగా ఎంతో ప్రతిభ ఉన్నటువంటి ఈషా రెబ్బ కి ఇప్పటి వరకు తన నటనా ప్రతిభను నిరూపించుకోవటానికి సరైన అవకాశం రాలేదని చెప్పాలి.
ఆ మధ్య “అరవింద సమేత వీర రాఘవ, అ!” తదితర చిత్రాలలో రెండో హీరోయిన్ పాత్రలలో నటించినప్పటికీ సరైన అవకాశాలను దక్కించుకోలేక పోయింది.
అయితే తాజాగా ఓ ప్రముఖ షోలో పాల్గొని తన ఫస్ట్ లవ్ మరియు క్రష్ గురించి ప్రేక్షకులతో పంచుకుంది.
ఇందులో తాను ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో ఓ వ్యక్తిపై క్రష్ ఉండేదని ప్రస్తుతం ఆ వ్యక్తికి పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారని తెలిపింది.అయితే ఈ క్రష్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం వరకు ఉండేదని, కానీ ఎప్పుడూ కూడా ఆ వ్యక్తితో తాను మాట్లాడ లేదని కానీ అప్పుడప్పుడూ ఫేస్ బుక్ లో అతడికి సంబందించిన అప్డేట్లు చూస్తుంటానని తెలిపింది.
అలాగే ప్రస్తుతం అతడు పూణేలో ఉద్యోగం చేస్తున్నాడని చెప్పుకొచ్చింది.కానీ అతడి పేరు మాత్రం ఈషా రెబ్బ బయట పెట్టలేదు.దీంతో తన ఫస్ట్ క్రష్ పేరు చెప్పాలంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ఆమధ్య హిందీలో మంచి విజయం సాధించినటువంటి లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ ని తెలుగులో పిట్ట కథలు పేరుతో రీమేక్ చేయగా ఈషా రెబ్బ మంచి పాత్రలో నటించింది.
కానీ ఈ వెబ్ సిరీస్ హిందీలో మాదిరిగా తెలుగులో ప్రేక్షకులు పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.ప్రస్తుతం ఈషా రెబ్బ తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.
కాగా ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు భాస్కర్ దర్శకత్వం వహిస్తుండగా అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్నాడు.అలాగే టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.
దీంతో ఇటీవలే తమిళంలో కూడా ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.