టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నటించారు.
ఇది బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.
నాలుగేళ్ళ నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెట్టి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మార్చి 25న రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
అభిమానులతో పాటుగా సినీ ప్రముఖులు కూడా ఈ ఇద్దరి హీరోల నటనకు ఫిదా అయ్యారు.
ప్రెసెంట్ ప్రపంచ వ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ మ్యానియా కనిపిస్తుంది.బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ ఇంకా దూసుకు పోతుంది.
మన దేశంలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా భారీ వసూళ్లు రాబట్టి ఆర్ ఆర్ ఆర్ పవర్ చూపించింది.ఇంత అద్భుతమైన హిట్ అందుకున్న నేపథ్యంలో టీమ్ అంతా కూడా చాలా సంతోషంగా కనిపిస్తున్నారు.
ఇక ఈ క్రమంలోనే ఈ సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్ నిన్న ముంబై లో ఘనంగా జరిగాయి.ఈ సెలెబ్రేషన్స్ లో టీమ్ అంతా మరోసారి మీడియాతో మాట్లాడారు.రాజమౌళి ఈ సినిమాపై విదేశీ రాతలు, అక్కడి ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ గురించి ఈ వేదికపై స్పందించారు.
విదేశీ మీడియా నుండి ఆర్ ఆర్ ఆర్ ప్రసంసలు పొందడం గురించి రాజమౌళి స్పందిస్తూ.
యునైటెడ్ స్టేట్స్ ఈ సినిమాను ప్రసంశిస్తుంది అని తాను ఊహించలేదని తెలిపాడు. బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్ రెండు కూడా విదేశీ ప్రేక్షకుల ఆదరణ పొందడం చాలా ఆనందంగా ఉందని తెలిపాడు.
అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించడం నాకు హార్ట్ టచింగ్ మ్యాటర్ అని తెలిపాడు.
బాహుబలి 2 కి జపాన్ నుండి ప్రసంసలు వస్తే ఆర్ ఆర్ ఆర్ సినిమాకు యుఎస్ నుండి ఆదరణ వస్తుందని ఊహించలేదు.బాక్సాఫీస్ నంబర్స్ ముఖ్యమనే విషయాన్నీ కాదనలేము కానీ ప్రేక్షకుల నుండి ప్రసంసలు చాలా ముఖ్యమైనవి అంటూ ఆయన ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేసారు.మనం చేయగలిగింది 100 శాతం ఇవ్వడం.
అంకెలు మన చేతుల్లో లేవు, ప్రేక్షకుల చేతుల్లో ఉన్నాయి.ప్రేమ, ప్రసంసలు మాత్రమే మనం అంచనా వేయగలం అంటూ చెప్పుకొచ్చాడు.