దుమాలలో ప్రతిమ మెడికల్ కళాశాల బస్సు ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో దుమాల గ్రామంలో ప్రతిమ మెడికల్ కళాశాల వారి ఉచిత బస్సు బుధవారం సర్పంచ్ కదిరే రజిత శ్రీనివాస్ గౌడ్, ప్రతిమ మెడికల్ కళాశాల ఎల్లారెడ్డిపేట మండల కోఆర్డినేటర్ ఒగ్గు బాలరాజు యాదవ్ కలసి ప్రారంభించారు.మొదటిరోజు దాదాపుగా దుమాల గ్రామం నుండి 30 మంది వరకు వైద్య చికిత్స కోసం ప్రతిమ మెడికల్ కళాశాలకు వెళ్లడం జరిగింది.

 Prathima Medical College Bus Started At Ellareddy Peta Mandal Dumala Village, Pr-TeluguStop.com

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ….ప్రతిమ మెడికల్ కళాశాల వారి వైద్య సేవలను దుమాల గ్రామస్తులు వినియోగించుకోవాలని కోరారు.

ప్రతిమ మెడికల్ కళాశాల మండల కోఆర్డినేటర్ ఒగ్గు బాలరాజు యాదవ్ మాట్లాడుతూ …

ప్రతి శుక్రవారం దుమాల గ్రామం నుండి అదేవిధంగా రాగట్లపల్లి గ్రామాల మీదుగా అక్కడి పేషెంట్లను వైద్య చికిత్స కోసం పంపించనున్నట్లు ఆయన తెలిపారు.త్వరలో రాగట్ల పల్లెలో కూడా ప్రతిమ మెడికల్ కళాశాల బస్సును ప్రారంభించబోతున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రతిమ మెడికల్ కళాశాల బస్ ఇంచార్జ్ బాల్ శంకర్, దూమల ఉపసర్పంచ్ రేండ్ల హనుమంతు, మాజీ ఎంపీటీసీ పొన్నం బాల్ కిషన్ గౌడ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ఖానాపురం లక్ష్మణ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube