ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే తృణ ధాన్యాల్లో గోధుమలు ఒకటి.చక్కటి రుచిని కలిగి ఉండటమే కాదు.
ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, ఐరన్, సెలీనియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి, విటమిన్ ఇ ఇలా బోలెడన్ని పోషక విలువలు గోధుమల్లో నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్య పరంగా గోధుమలు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.
ముఖ్యంగా మధుమేహం వ్యాధి గ్రస్తుల్లో బ్లెడ్ షుగర్ లెవల్స్ను అదుపు చేయడంలోనూ, రక్త హీనత దరి చేరకుండా రక్షించడం లోనూ, మూత్ర పిండాల్లో రాళ్ళను కరిగిండచంలోనూ, థైరాయిడ్ గ్రంథి పని తీరును మెరుగు పరచడంలోనూ, అధిక బరువు సమస్య నుంచి విముక్తి కలిగించడంలోనూ, గుండె జబ్బులు దరి చేరకుండా అడ్డు కట్ట వేయడం లోనూ.ఇలా చెప్పు కుంటూ పోతే ఎన్నెన్నో విధాలుగా గోధుమలు మనకు ఉనయోగపడతాయి.
అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ.కొందరు మాత్రం గోధుమలను తినరాదు.
ఆ కొందరు ఎవరో కాదు.జీర్ణ వ్యవస్థ పని తీరు సరిగ్గా లేని వారు.
ఎవరైతే తరచూ గ్యాస్, ఎసిడిటి, అజీర్తి, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో సతమతం అవుతుంటారో వారు.గోధుమలతో తయారు చేసే వంటలకు దూరంగా ఉండటమే మంచిది.
ఎందుకంటే, గోధుమల్లో గ్లూటెన్ కంటెంట్ అత్యధికంగా ఉంటుంది.ఈ గ్లూటెన్ ప్రోటీన్ కుటుంబానికి చెందినదే.
అయితే ఇది జీర్ణం కావడానికి చాలా సమయం తీసుకుంటుంది.అందుకే జీర్ణ సమస్యలతో బాధ పడే వారు గోధుమలను తీసుకుంటే.జీర్ణ వ్యవస్థపై ఎక్కువ ఒత్తిడి పడి మరింత వీక్గా తయారు అవుతుంది.ఇక నిద్ర లేమి సమస్యతో బాధ పడే వారు కూడా గోధుమలను ఎవైడ్ చేయడమే మంచిది.
ఎందు కంటే, గోధుమ ఆహారాలు శరీరంలో అధిక వేడిని పుట్టిస్తాయి.దాని కారణంగా నిద్రకు ఆటకం కలిగే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి.