ప్రజలను రెచ్చగొడితే ఓట్లు వేయరు..: మంత్రి గంగుల

బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ పై మంత్రి గంగుల కమలాకర్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నాలుగున్నర ఏళ్లుగా ఎంపీ బండి సంజయ్ నియోజకవర్గంలో కనిపించలేదని విమర్శించారు.

ఎంపీగా ఉన్న బండి సంజయ్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా తీసుకొచ్చారా అని మంత్రి గంగుల ప్రశ్నించారు.ఈ క్రమంలోనే ప్రజలను రెచ్చగొడితే ఓట్లు వేయరని పేర్కొన్నారు.

కరీంనగర్ లో బండి సంజయ్ మూడో స్థానానికే పరిమితమని చెప్పారు.బండి సంజయ్ అబద్ధాలతో రాజకీయం చేస్తున్నారని విమర్శలు చేశారు.

సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని
Advertisement

తాజా వార్తలు