అతన్ని రాష్ట్రపతి చెయ్యండి.. అది మనకు ఎంతో అవసరం: నాగబాబు

మెగా కుటుంబంలో నటుడిగా నిర్మాతగా ఎంతో పేరు సంపాదించుకున్న మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

ఈ క్రమంలోనే సామాజిక అంశాలపై కూడా నాగబాబు స్పందిస్తూ ఉంటారు.

తాజాగా నాగబాబు తర్వాతి రాష్ట్రపతి ఎవరు అనే అంశంపై కూడా స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం మన దేశం ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉందో అందరికీ తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడటానికి ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలని నాగబాబు తెలియజేశారు.ఇప్పటి వరకు బాగానే ఉన్నా తరువాత రాష్ట్రపతి ఎవరు అయితే బాగుంటుందనే విషయంపై కూడా నాగబాబు తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

దేశంలోనే వ్యాపార రంగంలో ఎంతో సమర్ధుడు అయినటువంటి రతన్ టాటా తరువాత రాష్ట్రపతి అయితే దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం వ్యక్తం చేస్తూ తన కోరికను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం మరి కొద్ది రోజులలో ముగియనుండడంతో రాష్ట్రపతి ఎవరు అనే విషయం పై పలుసార్లు చర్చలు జరిగాయి.

Advertisement

ఈ క్రమంలోనే ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ పేరు కూడా వినిపిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే మెగా బ్రదర్ నాగబాబు మాత్రం రతన్ టాటా పేరు తెరపైకి తీసుకువచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు.ఈ క్రమంలోనే రతన్ టాటా చేసినటువంటి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు నాగబాబుకు మద్దతు తెలపగా మరికొందరు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు