ఎన్టీఆర్ జిల్లా మైలవరం మార్కెట్ యార్డ్ కార్యాలయంలో మద్యం సేవించిన ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది.ఆఫీస్ లో విధులు నిర్వహిస్తూ ఇద్దరు ఉద్యోగులు బీర్ సాహెబ్, నాగరాజు మద్యం సేవించిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు బాధ్యులైన సిబ్బందిని సస్పెండ్ చేశారు.అదేవిధంగా వీరితో పాటు మరి కొంతమంది ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.
ఈ క్రమంలో ఎవరెవరు ఉన్నారన్న దానిపై ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు.విధి నిర్వాహణలో అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించబోమని ఏడీఎం కిషోర్ తెలిపారు.