గురువారం మధ్యాహ్నం (అమెరికా కాలమానం ప్రకారం) సమయంలో న్యూయార్క్( New York ) నగరంలో ఓ భయంకర హెలికాప్టర్ ప్రమాదం( Helicopter Crash ) చోటుచేసుకుంది.ఓ హెలికాప్టర్ గాలిలో గిరగిరా తిరుగుతూ అందరూ చూస్తుండగానే నదిలో కుప్పకూలిపోయింది.
ఈ ప్రమాదంలో ప్రముఖ టెక్నాలజీ కంపెనీ సీమెన్స్( Siemens ) స్పెయిన్ విభాగ అధిపతి, సీఈవో అగస్టిన్ ఎస్కోబార్( Agustin Escobar ) తన కుటుంబంతో సహా ప్రాణాలు కోల్పోయారు.ప్రమాద సమయంలో హెలికాప్టర్లో అగస్టిన్ ఎస్కోబార్తో పాటు, ఆయన భార్య, ముగ్గురు పిల్లలు ఇంకా పైలట్ ఉన్నారు.
హెలికాప్టర్ కూలిపోతున్న దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అవి కాస్తా వైరల్గా మారాయి.
ఈ వీడియోలలో హెలికాప్టర్ గాలిలో తిరుగుతూ క్రమంగా నదిలోకి కూలిపోయే దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి.ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని బోట్ల సాయంతో సహాయక చర్యలు ప్రారంభించాయి.అయితే, హెలికాప్టర్ పూర్తిగా తలకిందులుగా నీళ్లలో కూరుకుపోయిందని అధికారులు తెలిపారు.
గాల్లో ఉండగానే హెలికాప్టర్లోని ఒక భాగం విరిగిపోవడం వల్లే ఇది జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ దుర్ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ ప్రమాదాన్ని “భయంకరమైనది”గా ఆయన అభివర్ణించారు.అగస్టిన్ ఎస్కోబార్ మృతి టెక్ ప్రపంచానికి తీరనిలోటుగా మారిందని పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.
ఈ ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.ప్రమాదానికి గల కారణాల అతి త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశముంది.
ఎంత పెద్ద పొజిషన్ లో మనిషి ఉన్న కర్మ ఫలితం అంటే ఇదే కాబోలు మరి.