గురుకుల అభ్యర్థులకు ఒకే పరీక్ష సెంటర్ ఉండాలి:పి.డి.ఎస్.యు

నల్లగొండ జిల్లా:గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలను అభ్యర్థుల సొంత జిల్లాలోని నిర్వహించాలని పి.డి.

 Gurukula Candidates Should Have Only One Examination Centre: Pdsu , Suresh , Gur-TeluguStop.com

ఎస్.యు నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నూనె సురేష్ ( Suresh )డిమాండ్ చేశారు.సోమవారం జిల్లా కేంద్రంలోని శ్రామిక భవన్ లో జరిగిన పి.డి.ఎస్.యు ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఏళ్ల తర్వాత నిర్వహించే గురుకుల ఉపాధ్యాయుల ఎంపిక పరీక్షలను ఒక పరీక్ష ఒక్కో జిల్లాలో నిర్వహించడం వల్ల గురుకుల టీచర్ అభ్యర్థులు( Gurukula ) సకాలంలో చేరుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.200 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల దూరంలో పరీక్షలు వరుసగా ఏర్పాటు చేయడంతో,చిన్నపిల్లలు ఉన్నవారు,గర్భిణీ అభ్యర్థులు ఇబ్బందులు పడతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గురుకుల ఉపాధ్యాయ అభ్యర్థులకు ఒకే పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

అలా చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పి.

డి.ఎస్.యు( PDSU ) నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు ఇందూరు మధు,చందన, మనిషా,వీరేష్,నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube