మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్( Pratibha Patil ) అస్వస్థతకు గురయ్యారు.దీంతో ఆమెను చికిత్స నిమిత్తం పుణెలోని ప్రైవేట్ ఆస్పత్రికి( private hospital in Pune ) తరలించారు.
జ్వరంతో పాటు ఛాతిలో ఇన్ ఫెక్షన్ తో ప్రతిభా పాటిల్ బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు.ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.కాగా భారత్ కు రాష్ట్రపతిగా పని చేసిన తొలి మహిళగా ప్రతిభా పాటిల్ చరిత్ర సృష్టించారన్న సంగతి తెలిసిందే.2007 నుంచి 2012 వరకు ఆమె పదవిలో కొనసాగారు.