CM Revanth Reddy : కాంగ్రెస్ పార్టీకి అండగా ఖమ్మం జిల్లా..: సీఎం రేవంత్ రెడ్డి

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అన్నారు.జిల్లాలోని మణుగూరులో కాంగ్రెస్ నిర్వహించిన ‘ప్రజాదీవెన సభ’ లో ఆయన పాల్గొన్నారు.

 Cm Revanth Reddy About Khammam People-TeluguStop.com

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు అయ్యారన్న ఆయన ఒక రాజ్యసభ సీటుు ఇచ్చామని పేర్కొన్నారు.ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్( Congress ) అద్భుత విజయాలు సాధించిందని తెలిపారు.

కార్యకర్తలు రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ ను గెలిపించారని చెప్పారు.

ఖమ్మం జిల్లా( Khammam ) పోరాటం, ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని తెలిపారు.గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS Govt ) దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు హామీతో మోసం చేసిందన్నారు.గత మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఖమ్మం జిల్లా ప్రజలు గెలవనివ్వలేదని చెప్పారు.

కేసీఆర్ ను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు నమ్మలేదని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube