ఇటీవల కాలంలో నటి మాధవీలత ఏదో ఒక వివాదం కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు.అయితే గతంలో నటించినటువంటి “నచ్చావులే” తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.
అయితే ఆ తరువాత ఈ అమ్మడు నటించిన టువంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో రానురాను సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.దీంతో ఈ అమ్మడు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరింది.
ఇందుకుగాను మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా పోటీ చేసింది.అయితే అనుకోని విధంగా పరాజయం చెందింది.
అయితే తాజాగా ఈ అమ్మడు తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా చేసినటువంటి ఓ పోస్టు నెట్టింట్లో కలకలం రేపుతోంది.అయితే ఇందులో గత ఏడాది ఓ వ్యక్తి తనకు ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేశాడని, ఈ ప్రపోజ్ చేసే సమయంలో నువ్వు లేకపోతే నేను లేనని నా ప్రాణాలతో ఉన్నంతవరకు ప్రేమిస్తానని అన్నాడని అన్నారు.
అంతేకాక నువ్వే నా దేవత నువ్వు లేకుండా నేను బ్రతక లేను అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్పాడని అన్నారు.అయితే ఏమైందో కానీ ఉన్నట్లుండి ఆ వ్యక్తి కనిపించడంలేదని, ఒకవేళ పోయాడేమో అని అన్నారు.
ఎందుకంటే ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తానని అన్నాడు కదా మీకు ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి బాబులు…. అని ఈ పోస్ట్ లో పేర్కొన్నారు.
అంతేగాక అబ్బాయిలకి నిజంగా ప్రేమించే దమ్ము లేనప్పుడు ఇలాంటి నాటకాలు ఎందుకని ప్రశ్నించారు.ఇటీవల కాలంలో ఈ సమస్య తానొక్కతే కాదని తనలాంటి ఆడపిల్లలు ఎందరో ఎదుర్కొంటున్నారని కాబట్టి ఆడపిల్లలు కూడా నిజమైన ప్రేమకి, అబద్ధపు ప్రేమకి తేడా తెలుసుకోనీ మసలుకోవాలని లేకపోతే జీవితంలో చాలా నష్టపోతారని అన్నారు.అయితే మాధవీలత ప్రేమ గురించి పెట్టినటువంటి ఈ పోస్టు ఇప్పుడు నెట్టింట్లో బాగానే వైరల్ అవుతోంది.అంతేగాక నెటిజన్లు కూడా ప్రేమ విషయంలో మాధవీలత కి మద్దతుగా నిలుస్తున్నారు.