తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరిగింది..: అక్బరుద్దీన్ ఓవైసీ

తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరిగిందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు.24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.

 Electricity Consumption Has Increased In Telangana..: Akbaruddin Owaisi-TeluguStop.com

యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తి అయిందన్న అక్బరుద్దీన్ ఓవైసీ గతంలో పరిశ్రమలకు పవర్ హాలిడేస్ ఉండేవని చెప్పారు.తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్ గా నిలిచిందని తెలిపారు.

అలాగే పరిశ్రమలు, వ్యవసాయానికి రాష్ట్రంలో 24 గంటల కరెంట్ వస్తోందని వెల్లడించారు.కాంగ్రెస్ చెప్పిన విధంగా ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.గత ప్రభుత్వంలో పాతబస్తీలో రూ.25 వేల కోట్ల అభివృద్ధి జరిగిందని చెప్పారు.ప్రజాప్రతినిధిగా సమస్యలను ప్రస్తావించడం తన బాధ్యతని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube