తమ సమస్యల పరిష్కారం కోసం దేశ రాజధాని ఢిల్లీ( Capital is Delhi ) సరిహద్దుల్లో వేలాది మంది రైతులు మరోసారి నిరసనకు దిగడం కలకలం రేపుతోంది.మరోవైపు రైతుల ఆందోళనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రవాసుల నుంచి మద్ధతు పెరుగుతోంది.
రైతుల నిరసనలకు 10 నెలలు పూర్తయిన సందర్భంగా బుధవారం అమెరికాలోని కాలిఫోర్నియాలో ర్యాలీ ( Rally in California, USA )నిర్వహించగా.తర్వాత కెనడాలోని సర్రేలో మరో కారు ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ విషయాన్ని రైతు నాయకుడు శర్వాన్ సింగ్ పంధేర్ ( Sharwan Singh Pandher )ధృవీకరించారు.భారతదేశంలోని నిరసన వైపు పశ్చిమ దేశాల దృష్టి పడేలా వలసదారులు ర్యాలీలు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు.
కాలిఫోర్నియాలో స్థిరపడిన ఎన్ఆర్ఐలు కూడా రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ ధాలివాల్కు సంఘీభావం తెలిపేందుకు రోజంతా నిరాహారదీక్ష చేయాలని నిర్ణయించారు.ఆయన దీక్ష గురువారంతో 17వ రోజుకు చేరుకుంది.
అటు రైతులను శాంతింపజేసేందుకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగాయి. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ ( Union Minister of State for Railways Ravneet Singh )బిట్లు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.తాజాగా పాటియాలాలో పర్యటించిన ఆయన.ధాలివాల్ ఆరోగ్యాన్ని వైద్యుల బృందం పర్యవేక్షిస్తోందని , రైతులు తమ నిరసనను విరమించుకోవాలని సూచించారు.అయితే ఇలాంటి హాస్యాస్పదమైన ప్రకటనలు చేయడం మానుకోవాలని బిట్టుకు పంధేర్ హితవు పలికారు.
రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ ధాలివాల్ నవంబర్ 26 నుంచి ఖనౌరీ సరిహద్దులో నిరవధిక దీక్షను చేస్తున్నారు.ఫిబ్రవరి 13 నుంచి దేశ రాజధాని ఢిల్లీ వైపుగా వెళ్లాలని రైతులు చేస్తున్న ప్రయత్నాలను భద్రతా బలగాలు అడ్డుకుంటున్నాయి.దీంతో నిరసనకారులు శంభు, ఖానౌరీ సరిహద్దుల్లోనే క్యాంపులు ఏర్పాటు చేసుకుని తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.
పంటలకు కనీస మద్ధతు ధర (ఎంఎస్పీ), రుణమాఫీ, రైతులు.రైతు కూలీలకు పింఛను, రైతులపై కేసుల ఉపహరణ తదితర డిమాండ్లను వారు ప్రభుత్వం ముందు పెడుతున్నారు.