ఆర్టీసీ బిల్లుకు తెలంగాణ రాజ్‎భవన్ నుంచి రాని అనుమతి

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్టీసీ బిల్లు ఇంకా రాజ్‎భవన్ లోనే ఉంది.ఈ మేరకు ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నుంచి అనుమతి రాలేదు.

 No Approval From Telangana Raj Bhavan For Rtc Bill-TeluguStop.com

ఆర్థిక పరమైన బిల్లు కావడంతో గవర్నర్ అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం బిల్లును రాజ్‎భవన్ కు పంపింది.ఈ క్రమంలో గవర్నర్ తమిళిసై అనుమతి తరువాత ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టనుంది.

ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులగా పరిగణిస్తూ ఇటీవల కేసీఆర్ కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పటికే ప్రభుత్వం పంపిన మూడు బిల్లులను గవర్నర్ తమిళిసై వెనక్కి పంపిన సంగతి తెలిసిందే.

పంచాయతీరాజ్, విద్యాశాఖ మరియు మున్సిపల్ శాఖలకు చెందిన బిల్లులను ఆమె వాపస్ పంపారు.గతంలో పది బిల్లులలో రెండు బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించడంతో మరో రెండు బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube