బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.. ఎమ్మెల్యే రాజాసింగ్

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అన్నారు.ఈ మేరకు రాష్ట్ర డీజీపీకి ఆయన లేఖ రాశారు.

ఎనిమిది నెంబర్లతో ఫోన్లు చేసి తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు.పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు.

బెదిరింపులు వస్తున్న కేసు పెట్టడం లేదన్న ఆయన జై శ్రీరామ్ వాయిస్ రేస్ చేస్తే మాత్రం వెంటనే కేసు బుక్ చేస్తారని మండిపడ్డారు.అనేక సార్లు ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని పేర్కొన్నారు.

గన్ లైసెన్స్ అడుగుతుంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని తెలిపారు.తన ప్రాణాలను ముప్పు ఉన్నా గన్ లైసెన్స్ ఇవ్వకపోవడం దారుణమంటూ లేఖలో స్పష్టం చేశారు.

Advertisement
సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని

తాజా వార్తలు