చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి రోజా

డేటా చోరీ వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి రోజా అన్నారు.డేటా దొంగ డేరాబాబా కన్నా డేంజరస్ అన్న ఆమె.

 Chandrababu Is Certain To Go To Jail: Minister Roja-TeluguStop.com

ప్రజల డేటాను సేవా మిత్ర ద్వారా టీడీపీ చౌర్యం చేసిందని వ్యాఖ్యనించారు.ఈ క్రమంలో చంద్రబాబు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోకపోతే జీవితాంతం జైల్లోనే ఉండాలన్నారు.

ఫోన్ ట్యాపింగ్ తో 23 మందిని బ్లాక్ మెయిల్ చేసి వారి పార్టీలో చేర్చుకున్నారని రోజా ఆరోపించారు.

పెళ్లి కానుకతో ఎక్కువ మేలు చేసిందని సీఎం జగనేనని పేర్కొన్నారు.

చంద్రన్న కానుకల పేరుతో దోచుకున్నారన్న ఆమె.అమ్ముడుపోని నెయ్యిని ఆ పథకంలో చేర్చారని విమర్శించారు.40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఎప్పుడైనా అమ్మఒడి ఆలోచన చేశారా అని ప్రశ్నించారు.ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలను మెంటల్ ఆస్పత్రిలో చేర్చేందుకు జనం ఉత్సాహంగా ఉన్నారని రోజా ఎద్దేవా చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube